GHMC ఎన్నికల ఫలితాలతో TRS ప్రభుత్వం పద్దతి మార్చుకోవాలి

GHMC ఎన్నికల ఫలితాలతో TRS ప్రభుత్వం పద్దతి మార్చుకోవాలి

గ్రేటర్ ఎన్నికల ఫలితాలు చూసైనా..TRS ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని సూచించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 100 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రావాల్సింది…అయితే అకాల వర్షాలతో 50లక్షల మెట్రిక్ టన్నులు కూడా వచ్చేలా కన్పించడంలేదన్నారు. వరిధాన్యానికి మద్దతు ధర విషయం లో కేంద్ర ప్రకటించిన దానికంటే.. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కలిపి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోందన్నారు. వివిధ కారణాల లో కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కూడా..పత్తి మద్దతు ధరలో కోత పెడుతోందన్నాని ఆరోపించారు. ధాన్య సేకరణ లో వ్యవసాయ అధికారులు ఫెయిల్ అయ్యారన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలను సహాయం చేస్తోందన్నారు. తెలంగాణ లో అలాంటి ఆలోచనే చేయకపోవడం దారుణమన్నారు. రబీ సాగు ప్రారంభమైనా రెండో విడత రైతు బందు ఊసే లేదన్నారు. అదే ఎన్నికలైతే…రైతు బందు డబ్బులు వెంటనే బ్యాంకుకు వస్తాయన్నారు.

ధరణి పోర్టల్ లో రిజిస్ట్రేషన్ కు సంబంధించిన అంశాలు అన్ని డిస్ ప్లే కావాలి..కానీ కొన్ని అంశాలే కనిపిస్తున్నాయని తెలిపారు జీవన్ రెడ్డి. ధరణి పోర్టల్ లో చాలా సమస్యలు ఉన్నాయని.. కలెక్టర్ ల నుంచి ప్రభుత్వం రిపోర్ట్ తెప్పించుకొని పరిష్కరించాలని సూచించారు. వారసత్వ భూమి రిజిస్ట్రేషన్ కు చాలా అడ్డంకులు ఉన్నాయన్నారు. హిందూ వారసత్వ పక్రియ ను ఈ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. ధరణి పోర్టల్ యాక్షన్ మీద మాత్రమే హైకోర్టు స్టే ఇచ్చింది..ఎందుకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు ఆపిందో అర్థం కావట్లేదన్నారు. ఎమ్మార్వో రిజిస్ట్రేషన్ లు తప్ప మరోపని చేయడానికి వీళ్ళేకుండా పోయిందని ఆరోపించారు. ఇకనైనా కేసీఆర్ కు బుద్ధి రాకపోతే భవిష్యత్ లో మరింత నష్టపోతారని హెచ్చరించారు జీవన్ రెడ్డి.