పరిషత్ ఎన్నికల్లో కారు జోరు

పరిషత్ ఎన్నికల్లో కారు జోరు

తెలంగాణ పరిషత్ ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతోంది.  5817 ఎంపీటీసీ, 538 జెడ్పీటీసీ స్థానాలకు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ 3523, కాంగ్రెస్ 1365, బీజేపీ 206, ఇతరులు 587 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించారు.ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. ఇక  538 జెడ్పీ స్థానాలకు టీఆర్ఎస్ 195, కాంగ్రెస్ 35, బీజేపీ 3, ఇతరులు రెండు జెడ్పీ స్థానాల్లో విజయం సాధించారు.