కేంద్రంలో రానున్నది హంగ్ పార్లమెంట్ : మల్లారెడ్డి

కేంద్రంలో రానున్నది హంగ్ పార్లమెంట్ : మల్లారెడ్డి

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో టీఆర్ఎస్ పార్టీ సమావేశం జరిగింది. చేవెళ్ల పార్లమెంట్ స్థానం గెలిచి సీఎం కేసీఆర్ కు బహుమతిగా ఇద్దామన్నారు మంత్రి మల్లారెడ్డి. కాంగ్రెస్, బీజేపీ హయాంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. దేశంలో పేదల కోసం ఎక్కువ పథకాలు సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో అమలవుతున్నాయన్నారు మల్లారెడ్డి. కేంద్రంలో హంగ్ వస్తుందని, అప్పుడు టీఆర్ఎస్ కీలకంగా వ్యవహరిస్తుందన్నారు మల్లారెడ్డి. మరోవైపు రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు గెలవాలన్నారు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి. ప్రభుత్వ పథకాలను ప్రజల దగ్గరకు చేర్చే బాధ్యత కార్యకర్తలదేనన్నారు.