కేసీఆర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన టీఆర్ఎస్ నేత

కేసీఆర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన టీఆర్ఎస్ నేత

నామినేటెడ్ పదవులకు ఎంపిక చేసిన వారిపై టీఆర్ఎస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ కు ఈటల ఫోబియా పట్టుకుంది అంటూ సొంత పార్టీ నాయకులే విమర్శలు చేస్తున్నారు. అన్ని పార్టీల వారిని ఒకే గంపకింద కమ్మడమే పెద్ద నష్టం అంటూ కేసీఆర్ నిర్ణయం పై అసంతృప్తిగా ఉన్నారు. ఇంతకాలం ఈటల వెనుక ఉండి పదవులు అనుభవించిన వారికే పదవులు అంటూ అసహనం చూపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్ పార్టీ విధానంపై ఆపార్టీ సీనియర్ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోనీ కమలాపూర్ మండల ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు కొలిపాక సాంబయ్య సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టారు.