MRO ఆఫీసులో బర్త్ డే పార్టీ జ‌రుపుకున్న TRS పార్టీ లీడ‌ర్

MRO ఆఫీసులో బర్త్ డే పార్టీ జ‌రుపుకున్న TRS పార్టీ లీడ‌ర్

మహబూబ్ నగర్ /రాజాపూర్ : కరోనా మహమ్మరి తగ్గడం లేదని జనం పరేషాన్ అవుతుంటే అధికార పార్టీ నేతలు మాత్రం గ్రామాల్లో హంగామా చేస్తున్నారు . జడ్చర్ల నియోజకవర్గంలోని రాజాపూర్ మండల కేంద్రంలో టీఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్ తన బర్త్​డే ను తహసీల్దార్ ఆఫీస్ లో ధూమ్ ధామ్ గా సెలబ్రేట్ చేసు కున్నడు. సాక్షాత్తు తహసీల్దార్ శంకర్ అతనికి శాలువా కప్పి సన్మా నం చేయడం వివాదాస్పదమైంది. గవర్నమెంట్ ఆఫీస్ లో టీఆర్ ఎస్ నేత బర్త్​డే జరిపిన తహసీల్దార్ పై చర్య తీసుకోవాలని బీజేపీ నాయకులు ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. నారాయణపేట జిల్లా కోయిలకొండ మండలం దమాయిపల్లి గ్రామానికి చెందిన అధికార పార్టీ కార్యకర్తలు మందు అమ్మడానికి డిసైడ్ అయ్యారు. ఇంకేముంది కోయిలకొండ నుంచి రెండు లక్షలు పెట్టి గ్రామంలో మందు దుకాణం తెరిచారు. దానికి సర్పంచ్ ను పిలిచి రిబ్బన్ కట్ చేయించారు. బె ల్ట్​షాపు ఏర్పాటు చేయడమే తప్పయి తే దాన్ని గుడి ముందే పెట్టడం, సర్పంచ్ ప్రారంభించడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .