బోధన్, వెలుగు: ఇచ్చిన హామీల అమలు ఏమైందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, లీడర్లను ఓట్ల కోసం వచ్చినప్పుడు నిలదీయాలని ప్రజలకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు. గురువారం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం నర్సాపూర్ శివారులో ‘ ప్రజా గోస -– బీజేపీ భరోసా’ యాత్రను ఆయన ప్రారంభించి బైక్ర్యాలీలో పాల్గొన్నారు. అంతకు ముందు హనుమాన్ మందిరంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. రాజా సింగ్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో గల్లీగల్లీకి.. వద్దు కేసీఆర్, సాలు కేసీఆర్, ఇంటికి పో కేసీఆర్.. అనే నినాదాలు వినిపిస్తున్నయ్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయలేదు” అని మండిపడ్డారు.బోధన్ ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి గెలుస్తారని సర్వేలో తేలడంతో ఇక్కడి ఎమ్మెల్యే షకీల్పరేషాన్లో పడ్డారని రాజాసింగ్ అన్నారు. రాజా సింగ్ వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, నాయకులు మేడపాటి ప్రకాష్రెడ్డి, కొలిపాక బాల్రాజ్, పోశెట్టి, నర్సింహరెడ్డి, సుధాకర్చారి తదితరులు పాల్గొన్నారు.