బీజేపీలో చేరిన టీఆర్ఎస్ సర్పంచ్లు

బీజేపీలో చేరిన టీఆర్ఎస్ సర్పంచ్లు

బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో మరింత దూకుడు పెంచారు. ఆయన విస్తృత ప్రచారం చేస్తూనే ఇటు చేరికలపైన ప్రధాన దృష్టి సారించారు. బుధవారం చౌటుప్పల్ మండలం అల్లాపురంలో టీఆర్ఎస్ సర్పంచ్ లు బీజేపీలో చేరారు. వారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కమలదళంలో చేరారు. టీఆర్ఎస్ సర్పంచ్ లకు రాజగోపాల్ రెడ్డి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

బీజేపీలో చేరినవారిలో గుండ్లబావి సర్పంచ్ పెద్దింటి హేమలత చంద్రారెడ్డి, అంకిరెడ్డిగూడెం సర్పంచ్ ముద్దం సుమిత్ర సత్తయ్య గౌడ్ లు ఉన్నారు. త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. మునుగోడులో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు.