రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన కొడంగల్ ప్రజలు

రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన కొడంగల్ ప్రజలు

కొడంగల్‌లో ఎంపీ రేవంత్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఎమ్మెల్యే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పరాభవం పొందారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఆయన అభ్యర్థులు కూడా పరాభవం పొందారు. కేవలం మూడు వార్డులతోనే కాంగ్రెస్ సరిపెట్టుకుంది. దాంతో రేవంత్ సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో టీఆర్ఎస్ విజయం సాధించింది. కొడంగల్ మున్సిపాలిటీ ఎలాగైన గెలవాలని రేవంత్ రెడ్డి భారీ ప్రచారం నిర్వహించారు. కానీ, ఆయన శ్రమకు తగిన ఫలితం దక్కలేదు. ఆ మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు పట్టంకట్టిన అక్కడి ప్రజానీకం మళ్లీ మున్పిపల్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్‌కే పట్టంకట్టింది.

For Municipal Elections Results See Here