TRT PET అభ్యర్థుల ఆందోళన..సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

TRT PET అభ్యర్థుల ఆందోళన..సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

టీఆర్టీ పీఈటీ ఫలితాల విడుదల కోసం అభ్యర్థులు ఆందోళనకు దిగారు. హైద్రాబాద్ బేగంపేటలోని సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు అభ్యర్థులు. 400 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి.. రెండేళ్లయినా ఫలితాలు ఇవ్వకపోవడంతో ఆందోళన చేస్తున్నారు. కోర్టు కేసులు క్లియర్ అయినా ప్రభుత్వం రిజల్ట్ ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నించిన PET అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు. వారు ప్రతిఘటించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అభ్యర్థులను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు పోలీసులు.