కోళ్ల వ్యానుకు ప్రమాదం.. నిమిషాల్లో 500 కోళ్లు మాయం

కోళ్ల వ్యానుకు ప్రమాదం.. నిమిషాల్లో 500 కోళ్లు మాయం

ఆగ్రా: పొగమంచుతో దారి కనిపించక ఓ వ్యాన్ మరో ట్రక్కును ఢీకొట్టింది. అలా ఒకదానివెంట మరొకటి మొత్తం 12 వెహికల్స్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్​ను క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇంతలో అటుగా వెళ్తున్న వాహనదారుల కళ్లు వ్యాన్​లోని కోళ్లపై పడింది. ఇంకేముంది.. కేజ్​ల తాళాలు పగలగొట్టి నిమిషాల్లోనే 500 కోళ్లను తీసకెళ్లారు. కొందరు గోనె సంచులతో వచ్చి మరీ కోళ్లను పట్టుకెళ్లారు. వాటిని తీసుకెళ్లొద్దని వ్యాన్ డ్రైవర్ ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు. బుధవారం ఉదయం ఆగ్రా హైవేపై జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.