ఉత్తర్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, స్కార్పియో ఢీకొన్న ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఆగ్రా సమీపంలోని ఎట్మౌడౌలా ప్రాంతంలో జరిగిన ఈ ఆక్సిడెంట్లో మరో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ట్రక్కు నాగాలాండ్కు చెందినదిగా.. కారు జార్ఖండ్కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. సమాచారమందుకున్న స్థానిక ఎస్పీ రోహన్ ప్రమోద్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.