ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఇండియా- పాక్ యుద్ధాన్ని బెదిరించి ఆపిన

ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఇండియా- పాక్ యుద్ధాన్ని బెదిరించి ఆపిన

సియోల్‌‌‌‌: భారత్‌‌‌‌–పాక్​ యుద్ధాన్ని తానే ఆపానంటూ అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ మళ్లీ కామెంట్​ చేశారు. ఇరు దేశాలను బెదిరించి మరీ దారికి తెచ్చానని చెప్పుకొచ్చారు. 

భారత్‌‌‌‌-పాకిస్తాన్‌‌‌‌ మధ్య యుద్ధాన్ని ఆపిన ఘనత తనదేనన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 10న పాకిస్తాన్‌‌‌‌పై భారత్‌‌‌‌ చేపట్టిన ‘ఆపరేషన్‌‌‌‌ సిందూర్‌‌‌‌’ తర్వాత రెండు దేశాల మధ్య జరిగిన ఉద్రిక్తతలను 250% టారిఫ్‌‌‌‌ బెదిరింపులతోనే ఆపానని తెలిపారు. 

‘‘భారత్‌‌‌‌-పాక్‌‌‌‌ మధ్య ఘర్షణలో 7 విమానాలు నేలకూలాయి. యుద్ధం మొదలైంది. భారత ప్రధాని మోదీ, పాక్‌‌‌‌ నేతలతో నేను ఫోన్‌‌‌‌లో మాట్లాడా.. మీ దేశాలపై 250%  టారిఫ్‌‌‌‌ విధిస్తా... మీరు ఎప్పటికీ అమెరికాతో వ్యాపారం చేయలేరు అని హెచ్చరించా. రెండు రోజుల తర్వాత వెంటనే సీజ్‌‌‌‌ఫైర్​ కుదుర్చుకున్నారు” అని ట్రంప్​ తెలిపారు.