నిమజ్జనంపై సర్కార్ నో క్లారిటీ

నిమజ్జనంపై సర్కార్ నో క్లారిటీ

హైదరాబాద్ : గణేశ్ నిమజ్జనం మీద హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై కేసీఆర్ సర్కారు సరిగా స్పందించలేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం వద్దంటూ నోటీసులు ఇస్తున్న పోలీసులు... ఎక్కడ చేయాలో క్లారిటీ ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. సాగర్ లో నిమజ్జనాన్ని అడ్డుకుంటే సీఎం క్యాంప్ ఆఫీసు ముందు లేదా డీజీపీ ఆఫీసు ముందు విగ్రహాలు పెట్టాలని గణేశ్ మండపాల నిర్వాహకులకు సూచించారు రాజాసింగ్.