ఓయూ, వెలుగు : రీసెర్చ్ స్కాలర్లకు నెట్ ఫెలోషిప్ రూ.30 వేలు ఇవ్వాలని, స్టూడెంట్లకు ఆర్థిక భారంగా మారిన మెస్ బిల్లులను రద్దు చేయాలని తెలంగాణ స్టూడెంట్స్ పొలిటికల్ జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ వలిగొండ నరసింహ ప్రభుత్వాన్ని కోరారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఓయూ పర్యటన రద్దు కావడంతో స్టూడెంట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రికి వినతిపత్రం అందజేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి స్టూడెంట్లకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు. కార్యక్రమంలో రీసెర్చ్ స్కాలర్లు ఎడెల్లి రవి, శ్రీను, పోతురాజు రాము, సునీల్ శెట్టి తదితరులు పాల్గొన్నారు.