- అనవసరంగా ఇబ్బందులకు గురికావొద్దు
- ప్రజలకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి
హైదరాబాద్: ఆర్టీసీ సిబ్బందిపై ప్రజలు విచక్షణరహితంగా దాడులు చేయడం సమంజసం కాదని, అలాంటివి అసలే సహించమని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వార్నింగ్ఇచ్చారు. ‘సంగారెడ్డి జిల్లా అందోల్ ఎంపీడీవో కార్యాలయం వద్ద ఓ బైకర్ నిర్లక్ష్యంగా నడపి ప్రమాదానికి కారణమయ్యాడు. అయినా తన తప్పేం లేదన్నట్టు తిరిగి ఆర్టీసీ బస్ డ్రైవర్పై దాడి చేశారు. దుర్బాషలాడుతూ విచక్షణరహితంగా కొట్టారు.
ఇలాంటి దాడులను యాజమాన్యం అసలే సహించదు. ఈ ఘటనపై అందోల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాం. ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నరు. ఆవేశంలో సిబ్బందిపై దాడి చేసి అనవసరంగా ఇబ్బందులకు గురికావొద్దు’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.