త్వరలో అన్ని బస్టాండ్‌‌లలో యూపీఐ పేమెంట్స్‌‌

త్వరలో అన్ని బస్టాండ్‌‌లలో యూపీఐ పేమెంట్స్‌‌
  • ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌‌‌‌ వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని బస్‌‌ స్టేషన్లలో ఉన్న టికెట్‌‌ బుకింగ్‌‌ కౌంటర్‌‌‌‌, రిజర్వేషన్‌‌ కౌంటర్‌‌‌‌, కార్గో, పార్సిల్‌‌ సెంటర్ల వద్ద త్వరలో యూపీఐ, క్యూఆర్‌‌‌‌ కోడ్‌‌ ద్వారా పేమెంట్స్‌‌ అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌‌‌‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌‌లోని ఎంజీబీఎస్‌‌, సికింద్రాబాద్‌‌ రేతిఫైల్ బస్టాండ్‌‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభిం చామని, ఇక్కడ ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. మంగళవారం నుంచి జేబీఎస్‌‌లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు.