టెట్ ఫైనల్ కీ విడుదల

టెట్ ఫైనల్ కీ విడుదల

టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టీఈటీ) ఫైనల్ కీ విడుదలైంది. బుధవారం టెట్ కన్వీనర్ రాధా రెడ్డి కీని విడదల చేశారు. జూలై 1 వ తేదీ న టెట్ ఫలితాలను విద్యా శాఖ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. జూన్ 27న ఫలితాలు విడుదల చేస్తామని తొలుత ప్రకటించారు. అయితే ఫలితాల విడుదల సమయం దగ్గరపడుతున్నా ఇంకా టెట్ ఫైనల్ కీ విడుదల కాలేదు. దీంతో ఒత్తిడికి గురవుతున్న టెట్ అభ్యర్థులు ఫైనల్ కీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో ఫలితాల విడుదల ఆలస్యం కానున్నట్లు టెట్ కన్వీనర్ ప్రకటించారు.

ఫలితాల విడుదలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. టెట్ ఫలితాలను జూలై 1న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. టెట్ ఫైనల్ కీ విడుదలలో జాప్యం ఫలితాల వెల్లడిలో ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది. జూన్ 12న టెట్ పరీక్ష నిర్వహించగా.. పేపర్ 1కు 3,18,506, పేపర్‌-2కు 2,51,070 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ నెల15న ప్రైమరీ కీ విడుదల చేశారు. ఇందులో పేపర్ 1లో 7,930, పేపర్ 2లో 4,663 అబ్జెక్షన్స్ వచ్చా యి. వీటిపై అధికారులు కసరత్తు చేశారు. ప్రస్తుతం ఫైనల్ కీ విడుదలైంది. ఫలితాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.