హైదరాబాద్: వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మరో జాబ్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. తాజాగా టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలో 82 అసిస్టెంట్ ఇంజినీర్ల(ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 27 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు జులై 11 తుది గడువు విధించారు. ఇక ఆగస్టు 14న అసిస్టెంట్ ఇంజినీర్ల పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే గ్రూప్ 1, పోలీస్ శాఖలోని పలు ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. గతంలో గ్రూప్-1, పోలీస్ శాఖతో పాటు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే.. 8 సంవత్సారాలుగా ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడం.. ఎలాంటి రిక్రూట్మెంట్లు జరగకపోవడంతో ఇప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్లకు భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇటీవల ముగిసిన గ్రూప్1 పోస్టుల కోసం రికార్డుల స్థాయిలో దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు http://tsnpdcl.cgg.gov.in వెబ్ సైట్ లింక్ పై క్లిక్ తెలుసుకోవచ్చని సంస్థ పేర్కొంది.