హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ రిలీజ్ చేసేందుకు టీఎస్పీఎస్సీ రం గం సిద్ధం చేసింది. ఇయ్యాల లేదా రేపు (మం గళవారం లేదా బుధవారం) విడుదల చేసే చాన్స్ ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేయగా, అక్టోబర్ 16న ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించారు.
పరీక్షలకు 2.85 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో ఒక్కో కేటగిరి నుంచి 1:50 రేషియోలో మెయిన్స్కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కటాఫ్ మార్కులు లేకపోవడంతో ఎవరికి అవకాశం వస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోపక్క గతంలో వర్టి కల్ విధానంలో పోస్టుల వివరాలను ప్రకటిం చగా, ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలతో హారిజాంటల్ విధానంలోనే భర్తీ చేస్తామని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. దీంతో మహిళా కోటాలో పోస్టులు తగ్గే చాన్స్ ఉంది. అన్ని కేటగిరిల్లో కలుపుకొని మొత్తం 25,150 మందిని మెయిన్స్కు టీఎస్పీఎస్సీ ఎంపిక చేయనుంది. మంగళవారం ఫైనల్ కోర్టు తీర్పు ఉందని, క్లారిటీ రాగానే రిజల్ట్స్ ఇవ్వనున్నట్టు టీఎస్పీఎస్సీ వర్గాలు తెలిపాయి.