
టీఎస్పీఎస్సీ పరీక్షా పేపర్లు హ్యాకింగ్ అయినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మార్చి 12న జరగాల్సిన టీపీబీవో( టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ) రాతపరీక్ష, 15, 16వ తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రాతపరీక్షను వాయిదా వేస్తున్నట్లుగా టీఎస్పీఎస్సీ ప్రకటించింది. వాయిదాపడ్డ పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేసింది. హ్యాకింగ్పై టీఎస్పీఎస్సీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.