- ఏప్రిల్ 30 వరకు టీఎస్ఆర్టీసీ స్పెషల్ ఆఫర్
హైదరాబాద్, వెలుగు : సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్యాసింజర్ల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో బెర్త్లపై 10 శాతం రాయితీ కల్పించాలని నిర్ణయించింది. సాధారణ టికెట్ ధరలో ప్రయాణికులు బుక్ చేసుకునే బెర్త్లపై 10 శాతం డిస్కౌంట్ను కల్పించింది.
లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులు తిరిగే అన్ని రూట్లలోనూ ఈ రాయితీ వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 30 వరకు డిస్కౌంట్ అమల్లో ఉంటుందని, ఆర్టీసీ బస్సుల్లో క్షేమంగా ప్రయాణించాలని కోరారు.