పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలి : వలీమహ్మద్​

పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలి : వలీమహ్మద్​

చేర్యాల, వెలుగు: పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని టీఎస్​యూటీఎఫ్​ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు వలీమహ్మద్​ పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రానికి బడిబాట ప్రచార జాత వచ్చిన సందర్భంగా పాత బస్​స్టాండ్​ వద్ద ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు. ప్రభుత్వ బడుల్లో పిల్లల నమోదు పెంపుదల కోసం 26 మండలాల్లో బడిబాట ప్రచార జాత కార్యక్రమం ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పిల్లల తల్లిదండ్రులు అధిక ఫీజులు చెల్లించి పిల్లలను ప్రైవేట్​ స్కూళ్లకు పంపి నష్టపోవద్దన్నారు.

 ప్రభుత్వ స్కూళ్లు మెరుగయ్యాయని, నాణ్యమైన విద్య అందుతుందని ప్రతి ఒక్కరూ వారి పిల్లలను సర్కారు బడులకే పంపించాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, మాజీ జడ్పీటీసీ నర్సింగరావు, మాజీ మార్కెట్​ చైర్మన్​ ఆగంరెడ్డి, కొమురవెల్లి టెంపుల్​మాజీ చైర్మన్​చంద్రయ్య, బీఆర్​ఎస్​ పట్టణ అధ్యక్షుడు నాగేశ్వర్​రావు, నర్సయ్య పంతులు, ఎంఈవో కిష్టయ్య, రాములు, యూనియన్​ నాయకులు యాదగిరి, కార్యదర్శి ప్రశాంత్​కుమార్, శివలింగం, కనకయ్య, శ్రీనివాస్​, రాజు, విజయ్, చంద్రయ్య , రాజిరెడ్డి పాల్గొన్నారు.