
చేర్యాల, వెలుగు: పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని టీఎస్యూటీఎఫ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు వలీమహ్మద్ పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రానికి బడిబాట ప్రచార జాత వచ్చిన సందర్భంగా పాత బస్స్టాండ్ వద్ద ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు. ప్రభుత్వ బడుల్లో పిల్లల నమోదు పెంపుదల కోసం 26 మండలాల్లో బడిబాట ప్రచార జాత కార్యక్రమం ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పిల్లల తల్లిదండ్రులు అధిక ఫీజులు చెల్లించి పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపి నష్టపోవద్దన్నారు.
ప్రభుత్వ స్కూళ్లు మెరుగయ్యాయని, నాణ్యమైన విద్య అందుతుందని ప్రతి ఒక్కరూ వారి పిల్లలను సర్కారు బడులకే పంపించాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, మాజీ జడ్పీటీసీ నర్సింగరావు, మాజీ మార్కెట్ చైర్మన్ ఆగంరెడ్డి, కొమురవెల్లి టెంపుల్మాజీ చైర్మన్చంద్రయ్య, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగేశ్వర్రావు, నర్సయ్య పంతులు, ఎంఈవో కిష్టయ్య, రాములు, యూనియన్ నాయకులు యాదగిరి, కార్యదర్శి ప్రశాంత్కుమార్, శివలింగం, కనకయ్య, శ్రీనివాస్, రాజు, విజయ్, చంద్రయ్య , రాజిరెడ్డి పాల్గొన్నారు.