శ్రీవారి భక్తులకు కీలక అప్ డేట్ రిలీజ్ చేసింది టీటీడీ. ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదలపై కీలక ప్రకటన చేసింది టీటీడీ. 2026 ఫిబ్రవరి నెలకు సంబంధించి వివిధ దర్శనాల, గదుల కోటా విడుదలకు సంబంధించి వివరాలు వెల్లడించింది టీటీడీ. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను నవంబర్ 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది టీటీడీ.ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చుని తెలిపింది టీటీడీ.
ఈ సేవా టికెట్లు పొందిన వారు నవంబర్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే.. వారికి టికెట్లు మంజూరవుతాయని తెలిపింది టీటీడీ. ఆర్జిత సేవా టికెట్లు నవంబర్ 21న విడుదల చేయనున్నట్లు ప్రకటనలో తెలిపింది టీటీడీ. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవం టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు తెలిపింది టీటీడీ.
వర్చువల్ సేవ టికెట్ల కోటా 21న విడుదల చేయనున్నట్లు తెలిపింది టీటీడీ.వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది.వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది టీటీడీ.
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25న ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది టీటీడీ. టికెట్ల విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని.. టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించింది టీటీడీ.
