అర్చకుల రక్షణలో టీటీడీ విఫలం: రమణ దీక్షితులు

అర్చకుల రక్షణలో టీటీడీ విఫలం: రమణ దీక్షితులు

అర్చకుల రక్షణ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ((TTD) పూర్తిగా విఫలమైందని తిరుమల గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపించారు.  ఇదే విషయాన్ని  ట్విట్టర్ ద్వారా సీఎం జగన్ కు తెలిపారు. అంతేకాదు ఇటీవల కన్నుమూసిన అర్చకుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలంటూ విజ్ణప్తి చేశారు.  అక్రమంగా పదవీ విరమణకు గురైన మాజీ ప్రధాన అర్చకుడు ఒకరు వంశపారంపర్య సేవలను పునరుద్ధరించాలని పోరాడుతూ మరణించారని చెప్పారు. మరో 45 ఏళ్ల జూనియర్ అర్చకుడు స్వామికి సేవలందిస్తూ ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. వీరిని కాపాడడంలో టీటీడీ విఫలమైందని అన్నారు.