తిరుమల కొండపై రీల్స్.. దివ్వెల మాధురికి టీటీడీ నోటీసులు..

తిరుమల కొండపై రీల్స్.. దివ్వెల మాధురికి టీటీడీ నోటీసులు..

దివ్వెల మాధురి... తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో ప్రేమాయణం ద్వారా అటు ఏపీ పాలిటిక్స్ లో ఇటు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది దివ్వెల మాధురి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దివ్వెల మాధురి.. దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఇన్స్టా రీల్స్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే.. గతంలో చేసిన ఇన్స్టా రీల్స్ దివ్వెల మాధురికి నోటీసులు పెట్టాయి. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

గతంలో తిరుమలలో దివ్వెల మాధురి ఇన్స్టా రీల్స్ కలకలం రేపుతున్నాయి. రీల్స్ చేయడం అలవాటుగా పెట్టుకున్న దివ్వెల మాధురి తిరుమలలో సైతం రీల్స్ చేయడం వివాదాలకు దారి తీసింది. దివ్వెల మాధురి తిరుమల కొండపై చేసిన రీల్స్ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తడంతో మాధురికి నోటీసులు జారీ చేసింది టీటీడీ. తిరుమలలో కేవలం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రీల్స్ చేస్తే ఎలాంటి తప్పు లేదని వాదిస్తున్నారు భక్తులు.

 

దేవదేవుని సన్నిధానం సమీపంలోని విభవ అతిధి గృహం దగ్గర రీల్స్ చేసిన మాధురి.. తిరుమల కొండపై రీల్స్ చేశారన్న అనుమానం రాకుండా ప్రకృతి, అతిధి గృహం పరిసరాలు మాత్రమే కనపడేలా రీల్స్ చేయడం గమనార్హం. అసలే.. లేటు వయసులో ప్రేమాయణంతో రచ్చకెక్కి.. దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ నుండి సస్పెండ్ అయ్యేదాకా వెళ్లిన ఈ ప్రేమ పక్షుల వ్యవహారంలో.. తిరుమల కొండపై రీల్స్ ఎపిసోడ్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.