ఏజెన్సీ సమస్యలు పరిష్కరించాలి : తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు గోపీచంద్‌‌‌‌

ఏజెన్సీ సమస్యలు పరిష్కరించాలి :  తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు గోపీచంద్‌‌‌‌
  •  రేపు ఉట్నూర్‌‌‌‌ ఐటీడీఏ ఎదుట ధర్నా

జైనూర్‌‌‌‌, వెలుగు: ఆదివాసీ ఏజెన్సీ ప్రాంత సమస్యలపై ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని తుడుం దెబ్బ కుమ్రం భీం జిల్లా అధ్యక్షుడు గేడం గోపిచంద్‌‌‌‌ కోరారు. సోమవారం ఉట్నూర్‌‌‌‌ ఐటీడీఏ ఎదుట  నిర్వహించనున్న ధర్నా పోస్టర్లను శనివారం జైనూర్​లో ఆవిష్కరించి మాట్లాడారు. పోలీస్‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌ నియామకాల్లో ఏజెన్సీ ప్రాంత యువతకు గతంలో ఉన్న 75 శాతం ప్రత్యేక రిజర్వేషన్‌‌‌‌ను పునరుద్ధరించాలని డిమాండ్​ చేశారు. 

ఆదివాసీల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ తదితర డిమాండ్లపై తుడుం దెబ్బ ఆధ్వర్యంలో సోమవారం ఉట్నూర్‌‌‌‌ ఐటీడీఏ ఎదుట నిర్వహించనున్న ధర్నాలో ఏజెన్సీ ప్రాంత ఆదివాసీలు భారీ ఎత్తును పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.