కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అమ్మకం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన ఉప్పల్ పోలీసులు 

కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అమ్మకం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన ఉప్పల్ పోలీసులు 

ఉప్పల్, వెలుగు:  కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్​అమ్ముతున్న ఇద్దరు అరెస్టయ్యారు. నిందితుల వద్ద తయారీకి వాడే పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్​ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిహార్​లోని ​తాజ్ పూర్​కు చెందిన మహ్మద్​ అహ్మద్(24), మహ్మద్​జునైద్(39) కొన్నేండ్ల కిందట సిటికి వచ్చి రామాంతాపూర్ కేసీఆర్​నగర్​లో  జే ప్రొడక్ట్స్​న్యూ నేషనల్​జింజర్​గార్లిక్​పేస్ట్​పేరుతో లేబుల్స్ అమ్ముతున్నారు. మరోవైపు అల్లం వెల్లుల్లి పేస్ట్​ను కల్తీ చేసి అమ్మేందుకు ప్లాన్ చేశారు.

మోనోహైడ్రేట్, జాంతమ్​గమ్​,సిట్రిక్​యాసిడ్​, సింథటిక్​ఫుడ్ కలర్స్​ను కలిపి కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్​తయారు చేసి మార్కెట్​లో అమ్ముతున్నారు.   పోలీసులు  దాడులు చేసి 2 కిలోల కల్తీ పదార్థాలను , 5 ప్లాస్టిక్​ డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 1,190 కేజీల కల్తీ అల్లం పేస్ట్​, 5 కేజీల18 టిన్నులు, అరకిలో 30 టిన్నుల అల్లం, వెల్లుల్లి పేస్ట్​ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.