
ఉప్పల్, వెలుగు: కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్అమ్ముతున్న ఇద్దరు అరెస్టయ్యారు. నిందితుల వద్ద తయారీకి వాడే పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిహార్లోని తాజ్ పూర్కు చెందిన మహ్మద్ అహ్మద్(24), మహ్మద్జునైద్(39) కొన్నేండ్ల కిందట సిటికి వచ్చి రామాంతాపూర్ కేసీఆర్నగర్లో జే ప్రొడక్ట్స్న్యూ నేషనల్జింజర్గార్లిక్పేస్ట్పేరుతో లేబుల్స్ అమ్ముతున్నారు. మరోవైపు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కల్తీ చేసి అమ్మేందుకు ప్లాన్ చేశారు.
మోనోహైడ్రేట్, జాంతమ్గమ్,సిట్రిక్యాసిడ్, సింథటిక్ఫుడ్ కలర్స్ను కలిపి కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. పోలీసులు దాడులు చేసి 2 కిలోల కల్తీ పదార్థాలను , 5 ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 1,190 కేజీల కల్తీ అల్లం పేస్ట్, 5 కేజీల18 టిన్నులు, అరకిలో 30 టిన్నుల అల్లం, వెల్లుల్లి పేస్ట్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.