హైదరాబాద్, వెలుగు: టూ బ్రదర్స్ ఆర్గానిక్ ఫామ్స్ తన ఉత్పత్తులను హైదరాబాద్లోని రత్నదీప్ స్టోర్స్లో విడుదల చేసింది. ఏ2 ఆవు నెయ్యి, ఖాప్లీ గోధుమ పిండి, గానుగ నూనె, రసాయన రహిత బెల్లం వంటి ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించారు.
పాతకాలపు ధాన్యాలను, సంప్రదాయ పద్ధతుల్లో తయారైన ఆహారాన్ని అందించడమే లక్ష్యమని సంస్థ తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్లోని రత్నదీప్ స్టోర్లలో ఇవి అందుబాటులో ఉంటాయి.
