కోటి పెట్టి కట్టిండ్రు.. రెండేళ్లకే కూలింది

కోటి పెట్టి కట్టిండ్రు.. రెండేళ్లకే కూలింది

కరీంనగర్‌‌‌‌‌‌‌‌ గణేశ్‌‌‌‌నగర్ బైపాస్‌‌‌‌లో కూలిన డ్రైన్

కరీంనగర్, వెలుగు:  కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గణేశ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ బైపాస్‌‌‌‌లోని డ్రైనేజీ కూలిపోయింది. రెండేళ్ల కిందే దీనిని నిర్మించారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ. కోటి అంచనా వ్యయంతో టెండర్లు పిలవగా, రూ.94.8 లక్షలకు ఓ కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ దక్కించుకున్నారు.  నాసిరకంగా నిర్మించడంతో కట్టిన కొత్తలోనే ఓ సారి కూలిపోయింది. అప్పుడు రాత్రికి రాత్రే మళ్లీ కట్టారు. ఇప్పుడు పడిన వర్షాలకు పూర్తిగా కూలింది. ఇలా నాసిరకం నిర్మాణాలు చేస్తున్న కాంట్రాక్టర్లు, పర్యవేక్షించాల్సిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.