
- ఎంటర్ప్రెన్యూర్ షిప్పై సమ్మిట్ప్రకటించిన టీఐఈ
హైదరాబాద్, వెలుగు: ఎంటర్ప్రెన్యూర్స్ గ్లోబల్ కమ్యూనిటీ అయిన టీఐఈ హైదరాబాద్ఈ నెల 31, వచ్చే నెల ఒకటో తేదీల్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ నిర్వహించనుంది. హైదరాబాద్లోని హైటెక్స్లో దీనిని ఏర్పాటు చేయనుంది. సమ్మిట్లో గ్లోబల్ వెంచర్ క్యాపిటల్ (వీసీ) సంస్థలు, ఏంజిల్ ఇన్వెస్టర్లు పాల్గొంటారు. పిచ్ పోటీల ద్వారా స్టార్టప్లు తమ ఆలోచనలను వారికి నేరుగా ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. స్టార్టప్ ఎక్స్పో ద్వారా నిధులు సేకరించవచ్చు.
1,500 మందికి పైగా వ్యవస్థాపకులు, పారిశ్రామిక నాయకులు, పాలసీ మేకర్స్ ఒకే చోట కలుస్తారు. స్టార్టప్లకు కీలకమైన భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి, తమ బ్రాండ్కు జాతీయ స్థాయిలో గుర్తింపు పెంచుకోవడానికి సమ్మిట్సహాయపడుతుంది. హైదరాబాద్ 2035 విజన్పై కీనోట్లు, టీఐఈ 50 అవార్డులు, స్టార్టప్ ఎక్స్పో వంటివి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
గత ఏడాది హైదరాబాద్ టెక్ స్టార్టప్లకు ఫండింగ్ 160 శాతం పెరిగి 571 మిలియన్ డాలర్లకు చేరిందని, నగరం ఏఐ, డీప్ టెక్, ఫిన్టెక్, హెల్త్టెక్ రంగాల్లో ఎదుగుగుతోందని టీఐఈ ప్రెసిడెంట్ పగడాల రాజేశ్ చెప్పారు.