ఈతకు వెళ్లి ఇద్దరు మృతి, నలుగురు సేఫ్

ఈతకు వెళ్లి ఇద్దరు మృతి, నలుగురు సేఫ్

మృతుల్లో ఒకరు జెన్​కో ఏడీఈ 

వనపర్తి, వెలుగు:  వనపర్తి జిల్లా ఆత్మకూరు సమీపంలోని రామన్ పాడ్ కాల్వలో శనివారం ఈతకు వెళ్లిన జెన్ కో ఉద్యోగి, అతడి తోడల్లుడు నీళ్లలో మునిగి మృతి చెందారు. మరో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు.  జెన్ కో ఏడీఈ రాజేంద్ర ప్రసాద్ (42)  సొంతూరు నాగర్ కర్నూల్.   రాజేంద్రప్రసాద్​ కుటుంబ సభ్యులతో పాటు మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన వారి దగ్గరి బంధువు శ్రవణ్ (40),  అతడి కుటుంబ సభ్యులు సరదాగా దగ్గర లోని రామన్ పాడ్ రిజర్వాయర్ కు వెళ్లే జూరాల ఎడమ కాల్వలో ఈతకు వెళ్లారు.

మొదట  రాజేంద్ర ప్రసాద్, శ్రవణ్ కాలువలోకి  దిగారు. ఈత కొడుతున్న పిల్లల్లో ఒకరు మునిగి పోతుండడంతో అందరూ  భయంతో అటుగా ఈదుకుంటూ వెళ్లారు. ఒకరిని ఒకరు పట్టుకుని మొత్తం ఆరుగురు గల్లంతయ్యారు. దీంతో అక్కడే ఉన్న స్థానికులు నలుగురు పిల్లలను ఒడ్డుకు తీసుకుని వచ్చారు. అంతా చూస్తుండగానే రాజేంద్ర ప్రసాద్, శ్రవణ్ నీటిలో కొట్టుకుపోయారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.