నీటిలో మునిగి ఒకరు.. ఉరేసుకుని మరొకరు

నీటిలో మునిగి ఒకరు.. ఉరేసుకుని మరొకరు
  • తాగిన మైకంలో ఈతకు వెళ్లిన ముగ్గురు ఫ్రెండ్స్​
  • ఈత రాక ఒకరి మృతి.. 
  • తనవల్లే ఇలా జరిగిందని ఉరేసుకున్న మరో యువకుడు
  • కల్వకుర్తిలో విషాదం

కల్వకుర్తి, వెలుగు:  నాగర్​ కర్నూల్​ జిల్లా కల్వకుర్తిలో శనివారం ముగ్గురు ఫ్రెండ్స్​ ఈతకు వెళ్లగా అందులో ఒకరు ఈతరాక చనిపోయారు. ఇదంతా తనవల్లే జరిగిందని భయంతో మరో యువకుడు ఉరేసుకున్నాడు.   కల్వfకుర్తి ఎస్ఐ రమేశ్​ తెలిపిన వివరాల ప్రకారం..  కల్వకుర్తి పట్టణానికి చెందిన అనిల్(19), వెల్దండ మండలం గుండాలకు చెందిన రాజు(19),  కల్వకుర్తి మండలం కుర్మిద్దకు చెందిన శివ(19)  దోస్తులు.  

ముగ్గురు ట్రాక్టర్ డ్రైవర్లు.  తాగిన మైకంలో పట్టణ శివారులోని వ్యవసాయ పొలంలోని ఫాంపాండ్​లో ఈత కొట్టడానికి వెళ్లారు.  వారిలో అనిల్ కు ఈత రాక నీటిలో మునిగి మృతిచెందాడు.  గమనించిన శివ ఇదంతా తన వల్లనే జరిగిందని పక్కనే ఉన్న చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు.  ఇంకో స్నేహితుడు రాజు వెంటనే అక్కడి నుంచి బయలు దేరి జరిగిన విషయం పోలీసులకు చెప్పాడు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.