టెహ్రాన్: జగ్ వసంత్, పైన్ గ్యాస్ ఎల్పీజీ నౌకలు హార్మూజ్ జలసంధిని దాటాయి. యూఏఈ తీరం నుంచి ఉత్తరం వైపు బయల్దేరిన నౌకలు.. సోమవారం తెల్లవారుజామున ఇరాన్కు చెందిన షెష్మ్, లరక్ దీవులకు చేరుకున్నాయి. అక్కడి నుంచి హార్మూజ్లోకి ప్రవేశించిన నౌకలు.. ఐఆర్ జీసీ అనుమతితో జలసంధిని దాటాయి.
ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. త్వరలోనే షిప్పులు భారత్ కు చేరుకోనున్నాయి. ఈనెల ఆరంభంలోనే గల్ఫ్ తీరంలో బయల్దేరిన నౌకలు.. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రారంభించడంతో అక్కడే చిక్కుకున్నాయి.
