జగద్గిరిగుట్టలో రెండు కిలోల గంజాయి సీజ్..

జగద్గిరిగుట్టలో రెండు కిలోల గంజాయి సీజ్..

హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టుబడింది. రూ.50 వేల విలువ చేసే గంజాయిని పట్టుకున్నారు ఎస్ఓటీ సిబ్బంది. వివరాల్లోకి వెళ్తే జగద్గిరిగుట్టలో గంజాయి స్మగ్లర్ ను నిందితుడి నుంచి 2 కిలోల గంజాయి, ఒక స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు ఎస్ఓటీ, బాలానగర్ పోలీసులు. నిందితుడు ఒడిశాకు చెందిన  శ్రీకాంత్ లీమా అని విచారణలో తేలింది. గత ఏడాదిగా గంజాయి స్మగ్లింగ్ నే వృత్తి గా చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. 

అయితే ఎన్నికల కోడ్ సందర్భంగా సిటీలో విస్తృతంగా పోలీస్ తనఖీలు జరుగుతున్నాయి. దీంతో గంజాయి కోసం పెడ్లర్స్ ఒడిశాకు వెళ్లడానికి భయపడుతున్నారు. దీంతో  తానే స్వయంగా హైదరాబాదు కు గంజాయితో తీసుకుని వచ్చి, పోలీసులకు పట్టుబడ్డాడు నిందితుడు శ్రీకాంత్ లీమా. నిందితుడిపై కేసు నమోదు చేసుకుని గంజాయి గురించి పూర్తి విచారణ చేస్తామన్నారు పోలీసులు.