నల్గొండలో ఘోర ప్రమాదం జరిగింది. పట్టణంలోని గొల్లగూడ శివారులో ఎఫ్ సిఐ గోదాముల వద్ద బైక్ అదుప తప్పి కింద పడింది. గేదె అడ్డం రావడంతో సడన్ బ్రేక్ వేయడంతో పల్సర్ బైక్ అదుపుతప్పింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రగాయాల పాలయ్యారు. బాధితులు నెల్లూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అటువైపుగా వెళ్తున్న నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగి గాయపడ్డ వారిని వెంటనే అంబులెన్స్ పిలిపించి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లతో కూడా మాట్లాడి గాయాలైన వారికి వెంటనే తగిన చికిత్స చేయాల్సిందిగా ఎమ్మెల్యే కోరారు.
ఇవికూడా చదవండి: