ఔటర్ రింగు రోడ్డు పై కంటైనర్ లో మంటలు..ఇద్దరు అగ్నికి ఆహుతి

ఔటర్ రింగు రోడ్డు పై కంటైనర్ లో మంటలు..ఇద్దరు అగ్నికి ఆహుతి

హైదరాబాద్ శంషాబాద్ ఔటర్ రింగు రోడ్డు పై ప్రమాదం జరిగింది.ఆంధ్రప్రదేశ్ నర్సాపూర్ నుండి రోయ్యల లోడుతో వస్తున్న భారీ కంటైనర్..హిమాయత్ నగర్ దగ్గరకు  రాగానే మరో లారీని ఢీ కొట్టింది. దీంతో  కంటైనర్ లో భారీగా మంటలు చెలరేగాయి. మంటల్లో సూరజ్, మూర్తునుజన్ అనే డ్రైవర్, క్లీనర్ సజీవ దహనమయ్యారు. విషయం తెలుసుకున్న రాజేంద్ర నగర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారిద్దరూ ఏపీకి చెందిన వారుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.