తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు

తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు

తెలంగాణలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి  మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. నవంబర్ 28న నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండం జానకం పేటలో అత్యధికంగా 5.1సెం.మీ.లు, నిజామాబాద్ నార్త్ లో 4.35సెం.మీ, నిజామాబాద్ లో 3.93సెం.మీ. వర్షాపాతం నమోదైంది.

వాతావరణ శాఖ ప్రకటనతో జీహెచ్​ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాల వల్ల నగరంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఈనెల 30వ తేదీన పోలింగ్ ఉన్నందున వర్షం వల్ల ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.