రాష్ట్రంలో మరో రెండ్రోజులు వానలు

రాష్ట్రంలో మరో రెండ్రోజులు వానలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొన్ని చోట్ల మరో రెండ్రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడొచ్చని పేర్కొంది. శనివారం సిద్దిపేట, జగిత్యాల, నల్గొండ, ములుగు, ఆదిలాబాద్, నాగర్​కర్నూల్, కామారెడ్డి, కొత్తగూడెం, గద్వాల, భువనగిరి, జనగామ, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్​ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా సిద్దిపేటలోని కొండపాకలో 6.8 సెం.మీ. వర్షం కురిసింది. హైదరాబాద్​లోనూ తేలికపాటి జల్లులు కురిశాయి.