హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో రెండు మండలాలను, కొత్తగా ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. కామారెడ్డి జిల్లాలోని మహమ్మద్నగర్ను నూతన మండలంగా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలంబొగారం గ్రామ పరిధిలో ఉన్న బార్సిగూడను రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్లను విడుదల చేసింది.
వీటిపై అభ్యంతరాలు ఉంటే చెప్పాలని నోటిఫికేషన్లలో పేర్కొంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎర్రవల్లిని మండలంగా ప్రకటిస్తూ ఇప్పటికే ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసి అభిప్రాయాలను సేకరించింది. తాజాగా అందుకు సంబంధించి తుది నోటిఫికేషన్ను విడుదల చేసింది.