ఇద్దరు అంత ర్రాష్ట్ర దొంగల అరెస్ట్

ఇద్దరు అంత ర్రాష్ట్ర దొంగల అరెస్ట్

ఇద్దరు అంత ర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు. సిరిసిల్ల పట్టణంలోని వెంకటేశ్వర వీధిలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. నిందితుల నుంచి  మూడు తులాల బంగారం, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ పంపామన్నారు. నిందితులు బోయినపల్లి మండలం రామన్నపేట కు చెందిన మల్యాల రంజిత్, చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లెకి చెందిన దర్శనాల రాజశేఖర్ లుగా పోలీసులు గుర్తించారు.