ఫ్లైట్లో ప్రయాణికుల మధ్య డిష్యుం డిష్యుం

ఫ్లైట్లో ప్రయాణికుల మధ్య డిష్యుం డిష్యుం

ఫ్లైట్లో ఇద్దరు ప్రయాణికులు ముష్ఠియుద్ధానికి దిగారు. థాయ్ స్మైల్ ఎయిర్‌వేస్ విమానంలో ఇద్దరు పాసింజర్స్  కొట్లాడుకున్నారు. బ్యాంకాక్ నుంచి కోల్‌కతా వచ్చిన విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య  వాగ్వాదం జరిగింది. మాటా మాటా పెరిగి  ఘర్షణకు దారి తీసింది. దీంతో ఓ ప్రయాణికుడు మరో ప్రయాణికుడి మీద చేయి చేసుకున్నాడు. అద్దాలు పెట్టుకున్న వ్యక్తి ..బ్లాక్ షర్ట్ వేసుకున్న మరో వ్యక్తి కొట్టుకున్నారు. అద్దాలు పెట్టుకున్న వ్యక్తికి స్నేహితులు కూడా  తోడై బ్లాక్ షర్ట్ వేసుకున్న వ్యక్తిని తీవ్రంగా కొట్టారు. ఈ ఫైట్ ను ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో  వైరల్ అయింది. 

గొడవను కంట్రోల్ చేసేందుకు విమాన సిబ్బంది, ఎయిర్ హోస్టెస్ లు ప్రయత్నించారు. ప్రయాణికులు శాంతించాలని కోరినా ఫలితం లేదు. గొడవను ఆపాల్సిన తోటి ప్రయాణికులు చూస్తూ ఉండిపోయారు. ఈ ఘటనపై  థాయ్ స్మైల్ ఎయిర్‌వేస్ స్పందించలేదు.  గొడవ పడిన ప్రయాణికులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.