- 14 కిలోల గంజాయి స్వాధీనం
సికింద్రాబాద్/వికారాబాద్/గచ్చిబౌలి, వెలుగు : గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చే డబ్బు కోసం రైళ్లలో గంజాయిని చేరవేస్తున్న ఇద్దరు రైల్కోచ్ ఉద్యోగులను పోలీసులు సోమవారం అరెస్ట్చేశారు. వారి నుంచి 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్రైల్వే సబ్ఇన్స్పెక్టర్శంకరయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 31న మధ్యాహ్నం ఒంటి గంటకు వికారాబాద్రైల్వేస్టేషన్లో ఆగిన కోణార్క్ ఎక్స్ప్రెస్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
బీ6 కోచ్లోని ఇద్దరు ప్యాసింజర్ల బెడ్రోల్ క్యాబిన్కింద రెండు బ్యాగుల్లో 14 కిలోల గంజాయి దొరికింది. వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా, మధ్యప్రదేశ్ షాజాపూర్ జిల్లా అభయ్పూర్గ్రామానికి చెందిన మనోజ్ పరమార్(25), మోరెనా జిల్లా ధరమ్ఘర్గ్రామానికి చెందిన అనిల్ ఉపాధ్యాయ్(28) అని తెలిసింది. మనోజ్ పరమార్కోణార్క్ఎక్స్ప్రెస్ఏసీ కోచ్లో అటెండెంట్గా, అనిల్ఉపాధ్యాయ్అదే రైలులో ప్యాంట్రీకార్ వెండర్గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
గత నెల 30న సాయంత్రం 6 గంటలకు కోణార్క్ఎక్స్ ప్రెస్బరహంపూర్రైల్వేస్టేషన్కు చేరుకోగా ఓ అజ్ఞాత వ్యక్తి వీరి వద్దకు వచ్చి బీ-6 కోచ్లో రెండు గంజాయి బ్యాగులు ఉన్నయ్.. ముంబైలో అందజేస్తే ఒక్కొక్కరికి రూ.25వేలు ఆశ చూపాడని నిందితులు ఒప్పుకున్నారు.
రూ.37.50 లక్షలు సీజ్
రైలులో తరలిస్తున్న రూ.37.50లక్షలను సికింద్రాబాద్జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. రైల్వే ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సికింద్రాబాద్రైల్వే స్టేషన్ ఫ్లాట్ఫాం నంబర్1పై పోలీసులు తనిఖీ చేపట్టగా, తమిళనాడులోని కాంచీపురం మధురాంతకం ప్రాంతానికి చెందిన పి.లక్ష్మణరామ్(45) అనే వ్యక్తి వద్ద రూ.500 నోట్లతో కూడిన రూ. 37.50 లక్షలు దొరికాయి. నగదుకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు చూపించకపోవడంతో సనత్నగర్ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ సమక్షంలో సీజ్చేశారు.
కిరాణా షాపులో గంజాయి విక్రయం
కిరాణం షాపులో ఓ మహిళా గంజాయి అమ్ముతూ పోలీసులకు పట్టుబడింది. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన ప్రకారం.. నానక్రాంగూడలో అనురాధ బాయి(39) అనే మహిళ కిరాణా షాప్నడుపుతోంది. ఆమె గంజాయి అమ్ముతుందనే సమాచారంతో మాదాపూర్జోన్ఎస్ఓటీ పోలీసులు సోమవారం రైడ్చేశారు. 39 ప్యాకెట్లు(300 గ్రాముల) గంజాయిని స్వాధీనం చేసుకొని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. ధూల్పేట్నుంచి గంజాయి తెప్పించి కూలీలు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులకు అమ్ముతున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు.