వర్ధన్నపేట మండలంలో..రెండు ఇసుక ట్రాక్టర్ల ఢీ

వర్ధన్నపేట మండలంలో..రెండు ఇసుక ట్రాక్టర్ల ఢీ

వర్ధన్నపేట, వెలుగు :  వర్ధన్నపేట మండలం ఇల్లంద  శివారులో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై  రెండు ఇసుక  ట్రాక్టర్లు ఆదివారం ఢీకొన్నాయి.  మార్కెట్ యార్డ్ మూల మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది.  

డ్రైవర్లకు  స్వల్ప గాయాలయ్యాయి.  వర్థన్నపేట మండల పరిధిలోని ఆకేరు వాగు నుంచి ఇసుక రవాణా జరుగుతోంది. తరచూ ప్రమాదాలతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.