మాలలకు రెండు సీట్లు కేటాయించాలి

మాలలకు రెండు సీట్లు కేటాయించాలి
  •      కాంగ్రెస్ పార్టీకి మాల మహానాడు విజ్ఞప్తి

జూబ్లీహిల్స్, వెలుగు: లోక్​సభ ఎన్నికల్లో మాలలకు రెండు సీట్లు కేటాయించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య కాంగ్రెస్ పార్టీని కోరారు. బుధవారం సిటీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

 ‘‘బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నది. జాతీయ ఎస్సీ కమిషన్ ఉన్నా.. ఎస్సీ వర్గీకరణ కోసం కేబినెట్ కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేయడం ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఒక్క పార్లమెంట్ సీటు గెలవకుండా అడ్డుకుం టాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాలలను అవమానించేలా మాట్లాడుతున్నారు. ఆయన వైఖరి మార్చుకోవాలి’’ అని చెప్పారు.

 సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్​లో కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి మద్దతు తెలుపుతున్న మాలలకు పెద్దపల్లి, నాగర్​కర్నూల్ లోక్​సభ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.