- రూలింగ్ పార్టీ లీడర్ల అండతో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు
- రెగ్యులర్ డీఈవో లేకున్నా ఇన్చార్జితో ప్రొసీడింగ్లపై సంతకాలు
- భూత్పూర్, ధర్మాపూర్లో పోస్టింగుల కోసం పైరవీలు
మహబూబ్నగర్, వెలుగు : రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఇద్దరు టీచర్లు అక్రమంగా బదిలీలు చేసుకున్నారు. అధికార పార్టీకి చెందిన అనుబంధ సంఘానికి వీరు లీడర్లు కావడంతో ఎడ్యుకేషన్ ఆఫీసర్లు కూడా ఇందుకు సహకారం అందించారు. రెగ్యులర్ డీఈవో లీవ్లో ఉండగా.. ఇన్చార్జి ఆఫీసర్తో సంతకాలు చేయించుకొని సొంత జిల్లాకు ట్రాన్స్ఫర్ అయినట్లు ప్రొసిడింగ్లు తెచ్చుకున్నారు.
ట్రాన్స్ఫర్ అయ్యాక పైరవీలు
జీవో 317 జారీ కాకముందు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన నారాయణగౌడ్ పాలకొండ యూపీఎస్లో ఎస్.రఘురాంరెడ్డి ఏనుగొండ జడ్పీహెచ్ఎస్లో టీచర్లుగా డ్యూటీలు చేసేవారు. ప్రభుత్వం గతేడాది జీవో 317 తీసుకురావడంతో వీరిలో నారాయణగౌడ్ నారాయణపేట జిల్లా మాగనూరు మండలం గూడెబల్లూర్లోని జడ్పీహెచ్ఎస్కు, రఘురాంరెడ్డి నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మొగల్ మడ్కలోని జడ్పీహెచ్ఎస్కు ట్రాన్స్ఫర్ అయ్యారు. అప్పటి నుంచి వీరు సొంత జిల్లాకు వచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందులోభాగంగా పాలమూరు జిల్లాకు చెందిన రూలింగ్ పార్టీ లీడర్ అండతో పైరవీలు చేశారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ఎడ్యుకేషన్ నుంచి జూలై 30న మెమో జారీ చేశారు. అదే రోజు నారాయణపేట జిల్లా డీఈవోకు డీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసి, రిలీవ్ కూడా చేశారు. అంతేకాదు అధికార పార్టీ లీడర్లు, ఎమ్మెల్సీల ద్వారా పాలమూరు జిల్లాలోని భూత్పూర్, ధర్మాపూర్లలో పోస్టింగ్ తీసుకోవడానికి ఇప్పటికే పైరవీలు ప్రారంభించినట్లు సమాచారం.
జూనియర్లైనా ట్రాన్స్ఫర్లు చేశారు
2009లో జిల్లాకు చెందిన దాదాపు 170 మంది బయో సైన్స్లో టీచర్లు ప్రమోషన్లు పొందారు. జీవో 317 ప్రకారం వీరందరిని సొంత జిల్లాలకు అలాట్ చేయాలి. కానీ, వీరిలో 60 శాతం మందినే సొంత జిల్లాలకు కేటాయించి, మిగతా వారిని సెకండ్ ఆప్షన్లో ఉన్న జిల్లాలకు పంపారు. అయితే, ప్రస్తుతం ట్రాన్స్ఫర్ లెటర్లు తీసుకున్న ఈ ఇద్దరికన్నా ముందు దాదాపు వందమంది ఉన్నారు. పైగా వీరిద్దరికి 2011లో ప్రమోషన్లు వచ్చాయి. ట్రాన్స్ఫర్ల విషయంలో సీనియర్లను కాకుండా జూనియర్లుగా ఉన్న వీరిని సొంత జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ జీవోకు సంబంధించి 13 జిల్లాలకు సబంధించిన స్పౌజ్ కేసులు ఉన్నాయి. అందులో పాలమూరు జిల్లా కూడా ఉంది. అలాగే విడోస్, సీనియర్లను జూనియర్లుగా, జూనియర్లను సీనియర్లుగా జరిగిన మిస్టేక్స్ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. వీటన్నిటిని పరిష్కరించకుండా, జీవోకు యాంటీగా వీరిద్దరికి అక్రమంగా ట్రాన్స్ఫర్స్ చేయడంపై టీచర్ యూనియన్ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సపోర్టింగ్ ఆర్డర్లు ఉన్నందునే సంతకాలు
కాగా, నారాయణపేట డీఈవో 15 రోజులుగా లీవ్లో ఉన్నారు. ఆయన స్థానంలో ఆఫీస్లో ఎఫ్వోగా ఉన్న మంజులకు ఇన్చార్జి డీఈవో బాధ్యతలు అప్పగించారు. ఈ విషయంపై సోమవారం ఆమె వివరణ కోరగా, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఉత్తర్వుల ప్రకారమే ఆర్డర్లు ఇచ్చినట్లు తెలిపారు. సపోర్టింగ్ ఆర్డర్లు ఉన్నందుకే సంతకాలు పెట్టినట్లు వివరణ ఇచ్చారు.