రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

పటాన్ చెరు: కారు, బైక్ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం పటాన్ చెరు దగ్గర హైదరాబాద్ -శ్రీశైలం ప్రధాన రహదారిపై జరిగింది. వెల్దండ మండల సమీపంలోని AVR గార్డెన్ దగ్గర కారు స్పీడ్ గా రావడంతో ప్రమాదవశాత్తు బైక్ ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పటాన్ చెరువు మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన గణేష్ ( 25), నాగరాజు (25),గా గుర్తించారు.

శ్రీశైలం పుణ్య క్షేత్రానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వెళుతుండగా.. హైదరాబాద్ వైపు నుండి వస్తున్న కారు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడే మృతి చెందినట్టు తెలిపారు ప్రత్యక్ష సాక్ష్యులు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టమ్ కోసం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.