
జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదులు, భద్రత బలగాలకు నడుమ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. సోఫియాన్ జిల్లా కెల్లర్ ప్రాంతంలో సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసులతో కలసి సైన్యం ఈ ఆపరేషన్ చేపట్టింది. మరింత మంది ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో సైన్యం గాలింపు కొనసాగిస్తోంది.