చెరువులో తేలిన కవలలు..ఒడ్డున అపస్మారక స్థితిలో మరో ఇద్దరు..

చెరువులో తేలిన కవలలు..ఒడ్డున అపస్మారక స్థితిలో మరో ఇద్దరు..

చిత్తూరు జిల్లా సదం మండలం చింతపర్తివారి పల్లెలో విషాదం జరిగింది. నడిమోడుకుంట చెరువులో అనుమానాస్పద స్థితిలో కవల పిల్లలు శవాలై కనిపించారు.  స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చిన్నారులను ఎవరు చెరువులో పడేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తుండగా….. పక్కనే పొదల్లో  అపస్మారక స్థితిలో ఉన్న ఓ వ్యక్తి సహా మహిళను గుర్తించారు.

మహిళ పూర్తిగా అపస్మారక స్థితిలో ఉంది. కొంచెం సృహలో ఉన్న వ్యక్తి అందించిన సమాచారం మేరకు పులిచిచర్ల మండలం ఈ.రామిరెడ్డిపల్లికి చెందిన హేమశ్రీగా గుర్తించారు. చెరువులో పడి ఉన్న కవలలు పునీత్ , పునర్విగా గుర్తించి.. పిల్లల తండ్రి వెంకటేశ్వర్ రెడ్డికి సమాచారం అందించారు. ఘటనాస్థలంలో ఉన్న వ్యక్తి ఒడ్డుపల్లికి చెందిన ఉదయ్  కుమార్ గా గుర్తించారు. ఉదయ్, మహిళ  పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.