ముంబయిలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో కాలిపోయిన టూవీలర్స్

ముంబయిలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో కాలిపోయిన టూవీలర్స్

ముంబయిలో సోమవారం (డిసెంబర్ 25న) భారీ అగ్నిప్రమాదం జరిగింది. లోయర్ పరేల్ ప్రాంతంలోని ఫీనిక్స్ మాల్ వద్ద మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 25 నుంచి 30 వరకు టూవీలర్స్ మంటల్లో దగ్ధమయ్యాయి.

షాపింగ్ మాల్ ఆవరణలో మధ్యాహ్నం 1:15 నిమిషాలకు మంటలు వచ్చాయి. అక్కడే పార్కింగ్ చేసి ఉన్న బైక్ లు అందరూ చూస్తుండగానే కాలిపోయాయి. ఇది గమనించిన స్థానికులు, మాల్ సిబ్బంది మంటలను ఆర్పివేసేందుకు తీవ్రంగా శ్రమించారు. 

విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను 30 నిమిషాల్లోపు ఆర్పివేశారు. అయితే.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాదాపు 25కు పైగా టూవీలర్స్ కాలిపోయాయి. అయితే..ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.