వేర్వేరు చోట్ల ఇద్దరు మిస్సింగ్

వేర్వేరు చోట్ల ఇద్దరు మిస్సింగ్

గచ్చిబౌలి/ఘట్​కేసర్, వెలుగు : పనికి వెళ్లిన యువతి కనిపించకుండా పోయిన ఘటన గచ్చిబౌలి పోలీస్​ స్టేషన్ పరిధిలో జరిగింది. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శ్రీరాములు కుటుంబంతో కలిసి గచ్చిబౌలి సుదర్శన్​నగర్​లో ఉంటున్నాడు. ఇతని కూతురు సాయిశ్రావణి(19) మజీద్​బండలోని ఓ అపార్ట్​మెంట్​లో హౌస్ కీపింగ్ పనిచేస్తుంది.

ఈ నెల 30న ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన సాయిశ్రావణి డ్యూటీకి వెళ్లలేదు. సాయంత్రమైన ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికారు. ఆచూకీ దొరకకపోవడంతో గురువారం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్​కేసు నమోదు చేశారు. 

ఘట్​కేసర్​లో మైనర్.. 

ఘట్​కేసర్​మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ నగర్​కు చెందిన ముక్ర శ్లోక(17) గతేడాది టెన్త్​క్లాస్​పూర్తిచేసింది. తరచూ ఫిట్స్ వస్తుండడంతో ఏడాదిగా ఇంటి వద్దే ఉంటోంది. గత నెల 31న సాయంత్రం స్థానిక షాపునకు వెళ్లిన శ్లోక తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదైంది.